ఏపీకి కేంద్రం భారీగా విపత్తు సాయం చేస్తోందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు చెప్పారు. విపత్తు నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఖర్చు చేసిందో లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పాలనను వదిలేసి సీఎం చంద్రబాబు రాజకీయాలపై దృష్టి సారిస్తున్నారని ఆరోపించారు. మాతో కలిసి లేకపోయినా తిత్లీ తుపాను సంభవించినప్పుడు రూ.559 కోట్లు కేంద్రం కేటాయించిందని గుర్తు చేశారు. తెలంగాణలో టీడీపీని వదిలేశాక బీజేపీకి ఓటు శాతం పెరిగిందన్న జీవీఎల్ బీజేపీకి ఒక్క సీటు రావడం గొప్ప విషయమన్నారు. చాలా చేశానన్న చంద్రబాబుకు దక్కింది రెండు సీట్లేగానని జీవీఎల్ ఎద్దేవాచేశారు.