ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పంట పెట్టుబడి పథకం దేశానికే ఆదర్శమని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రైతు బంధు పథకం ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి ఈటల మాట్లాడారు. రైతు బాగుపడితేనే రాష్ట్రం బాగుపడుతుందని అన్నారు. సీఎం కేసీఆర్ రైతు బాంధవుడని స్పష్టం చేశారు. ప్రజాహిత కార్యక్రమాలతో సీఎం కేసీఆర్ ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. సీఎం కేసీఆర్ కరీంనగర్ జిల్లాను వాటర్హబ్గా తీర్చిదిద్దారని అన్నారు. ఇప్పటికే వేలాది కోట్ల రూపాయలతో పల్లెలన్నీ బాగుపడ్డాయని..ఇంకా బాగుపడాల్సిన అవసరముందన్నారు ఈటల.