తెలంగాణలో కాంగ్రెస్ థర్డ్ లిస్ట్ విడుదలకు రంగం సిద్ధమైంది. కాసేపట్లో ఏఐసీసీ ఇన్చార్జి సెక్రటరీలు, పీసీసీ చీఫ్ భేటీ అయి జాబితాను ఖరారు చేయనున్నారు. ఇప్పటిదాకా విడుదలైన జాబితాల్లో కొందరు సీనియర్ల పేర్లు కనపించలేదు. ముఖ్యంగా జనగామ, తుంగతుర్తి, సనత్నగర్, ఎల్బి.నగర్లలో అభ్యర్థులపై క్లారిటీ రాలేదు. దీంతో ఇప్పటికే టిక్కెట్టు రాని సీనియర్లు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.