ఎన్నికల ప్రచారంలో గులాబీ బాస్ జెట్ స్పీడ్తో దూసుకుపోతున్నారు. సుడిగాలి పర్యటనలతో రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. ఒకే రోజు ఆరేడు సభల్లో పాల్గొంటూ నాలుగైదు జిల్లాలను కవర్ చేస్తున్నారు. ప్రచారానికి ఇంకా నాలుగు రోజులే సమయం ఉండటంతో మరింత స్పీడ్ పెంచిన కేసీఆర్ రేపట్నుంచి అత్యంత కీలకమైన హైదరాబాద్ అండ్ ఔట్ కట్స్పై దృష్టిపెట్టారు. తెలంగాణ ఎన్నికల ప్రచారం క్లైమాక్స్కి చేరుకుంటోంది. ప్రచారానికి ఇంకా నాలుగు రోజులు మాత్రమే మిగులుంది. దాంతో పార్టీలన్నీ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. అయితే జెట్ స్పీడ్తో దూసుకుపోతున్న గులాబీ బాస్ రోజుకి మూడు నాలుగు జిల్లాలను చుట్టేస్తూ, కనీసం ఆరేడు సభల్లో పాల్గొంటూ సుడిగాలి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే దాదాపు రాష్ట్రమంతా చుట్టేసిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు అత్యంత కీలకమైన హైదరాబాద్పై దృష్టిపెట్టారు. ఇప్పటికే మంత్రి కేసీఆర్ రోడ్షోలతో హైదరాబాద్ను చుట్టేయగా, రేపట్నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు. రేపు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు కలిపి భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. సాయంత్రం 5గంటల నుంచి ప్రారంభమయ్యే సభలో కేసీఆర్ పాల్గొని ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.