బీజేపీయేతర ఫ్రంట్‌‌ వైపు బాబు అడుగులు..19న మమతతో మంతనాలు

Update: 2018-11-13 14:34 GMT

దేశంలో బీజేపీయేతర కూటమి ఏర్పాటులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 19న కోల్ కతాకు పయనమయ్యారు. పశ్చిమబెంగాల్ సిఎం మమతాబెనర్జీతో చంద్రబాబు సమావేశంకానున్నారు. ఎలాగైన బీజేపీయేతర శక్తుల్ని ఏకాతాటిపైకి రావాలనే ప్రధాన అజెండాగా చంద్రబాబు వరుసగా ముఖ్యనేతలతో భేటీ అవుతున్నారు.  ఇటీవలే బెంగళూరు, చెన్నై వెళ్లి మాజీ ప్రధాని దేవెగౌడ, కుమారస్వామి, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో  మంతనాలు జరిపారు. మమతా బెనర్జీతో చంద్రబాబు భేటీని అత్యంత కీలకమైనదిగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

Similar News