ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు ఆటగాళ్లకు నజరానాలు భారీగానే అందుతున్నాయి. శనివారం జరిగిన ఫైనల్లో భారత్.. ఆసీస్పై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే బీసీసీఐ జట్టులోని ఒక్కో ఆటగాడికి రూ.30లక్షలు అందజేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు ఆ జట్టు కెప్టెన్ పృథ్వీషాకు ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) రూ.25 లక్షల ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. ఈ మేరకు ఎంసీఏ అధ్యక్షుడు ఆశిష్ ట్వీట్ చేశారు.
అండర్-19 ప్రపంచకప్లో వరుస విజయాలతో ఫైనల్కు దూసుకెళ్లిన పృథ్వీషా సేన ఆస్ట్రేలియాను చిత్తుచిత్తుగా ఓడించి నాలుగోసారి ప్రపంచకప్ను ముద్దాడి చరిత్ర సృష్టించింది. కాగా, ముంబైకి చెందిన పృథ్వీ షాకు ఆ రాష్ట్ర క్రికెట్ బోర్డు బహుమానం ప్రకటించడంతో ఇతర బోర్డులు కూడా తమ ప్లేయర్లకు నజరానా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఈ ఏడాది ఐపీఎల్ ఆటగాళ్ల వేలంలో పృథ్వీ షాను రూ.1.2కోట్లకు కోల్కతా నైట్రైడర్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.