రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి

Update: 2018-09-28 10:24 GMT

కుమ్రం భీం జిల్లా జైనూర్‌ మండలంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వేగంగా వస్తున్న ఐచర్‌ వ్యాన్‌ ఓ చిన్నారిని ఢీ కొట్టడంతో ఆ బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వ్యాన్‌ ముందు చక్రాల కింద నలిగి బాలుడు మృతిచెందాడు. దీంతో స్థానికులు తీవ్ర ఆగ్రహంతో వ్యాన్‌ను అడ్డగించారు. తర్వాత దానికి నిప్పంటించారు. మంటల్లో వ్యాన్‌ తగులబడిపోయింది. దీంతో జైనూర్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

Similar News