అలిపిరి ఘటన వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉన్నాడని బీజేపీ లీడర్ లక్ష్మీపతిరాజు ఆరోపించారు. చంద్రబాబు ప్రోద్బలంతోనే... టీడీపీ కార్యకర్తలు అమిత్షాను అడ్డుకుని... కాన్వాయ్పై దాడి చేశారని ఆరోపించారు. బీజేపీ నేతలపై దాడులకు ...తెలుగుదేశం పెద్దలు ప్రోత్సహిస్తున్నారని అన్నారు. అలిపిరి ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపించాలని బీజేపీ నేత లక్ష్మీపతిరాజు డిమాండ్ చేశారు.