ముందస్తు ఎన్నికల బరిలోకి ప్రత్యర్థులను లాగి. ఎన్నికలకు ఇంకా తొమ్మిది నెలల గడువు ఉండగానే జనాకర్షక పథకాలపై నమ్మకంతో బరిలోకి దిగి అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నారు. తెలంగాణలో సారు కారు సర్కారు అన్నా మాట నేటి ఫలితాలతో తెలిపోయింది. తెలంగాణ గడ్డపై గూలాబీ జెండా రెపరేపలాడింది. నాలుగేళ్లలోనే రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపిన టీఆర్ఎస్ పార్టీకే మళ్లీ అధికార పగ్గాలు అప్పజేప్పారు తెలంగాణ ప్రజలు. ఈ సందర్భంగా జాతీయ, ప్రాంతీయ పార్టీలకు చెందిన నేతలు, పలు రాష్ర్టాల ముఖ్యమంత్రులు సీఎం కేసీఆర్కు శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీహార్ సీఎం నితీశ్ కుమార్, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్కు స్వయంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.