ప్రత్యేక హోదాతో పాటు.. విభజన హామీల అమలు కోరుతూ.. ఏపీ ఎన్జీవోలు ధర్నా చేపట్టారు. కేంద్రంపై పోరాటంలో భాగంగా.. రాజకీయ పార్టీలు, ప్రజలకు తోడుగా.. తాము కూడా తోడొస్తామని తెలిపేందుకే నిరసన కార్యక్రమం చేపట్టినట్లు.. ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని కలెక్టరేట్ల ముందు ఉద్యోగులు ఆందోళన చేపడతామని వివరించారు. ఈ పోరాటంలో ముందు ముందు మిగతా సంఘాలతో కలిసి పనిచేస్తామని అశోక్ బాబు తెలిపారు.