భారత కుబేరుడు ముకేశ్ అంబానీ ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన కుమార్తె ఇశా అంబానీ ప్రముఖ వ్యాపారవేత్త, పిరమాల్ సంస్థల వారసుడు ఆనంద్ పిరమాల్ను వివాహం చేసుకోనుంది. ఈ రెండు కుటుంబాల మధ్య 40 ఏళ్లుగా కొనసాగుతున్న స్నేహబంధం.. ఈ పెళ్లితో బంధుత్వంగా మారనుంది.
ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇంట మరో శుభకార్యం జరగనుంది.. ఆయన పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ తన చిన్ననాటి స్నేహితురాలు శ్లోకా మెహతాను డిసెంబర్ లో వివాహం చేసుకోనున్నాడు.. అయితే ఈ పెండ్లి కంటే కాస్త ముందుగానే ముకేశ్ కుమార్తె ఇషా అంబానీ ప్రముఖ వ్యాపారవేత్త అజయ్ పిరమల్ కుమారుడైన ఆనంద్ పిరమల్ను వివాహం చేసుకోనున్నారు.
ఈశా, ఆనంద్ల మంచి స్నేహితులు.. కొద్దిరోజుల క్రితం మహాబలేశ్వరంలోని ఓ గుడిలో ఆనంద్, ఇషాకు ప్రపోజ్ చేశారు. ఇషా కూడా అంగీకారం తెలిపింది.. అనంతరం ఈ విషయాన్ని ఇరువురి కుటుంబాలకు తెలిపారు.. ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతాల వివాహం కంటే ముందే ఆనంద్, ఇషాల వివాహం జరుగుతుందని తెలుస్తోంది...
హార్వర్డ్ బిజినెస్ స్కూల్ గ్రాడ్యుయేట్ అయిన ఆనంద్ ప్రస్తుతం పిరమల్ ఎంటర్ప్రైజెస్ సంస్థకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఇక ఇషా అంబానీ రిలయన్స్ జియోతో పాటు రిలయన్స్ రిటైల్ బోర్డుల్లో డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. మొత్తానికి ఈ ఏడాది అబానీ ఇంట్లో రెండు శుభకార్యాలు జరగనున్నాయి..