తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్పై ప్రముఖ నటి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఖుష్బూ సంచలన ఆరోపణలు చేశారు. బతకమ్మచీరల పేరుతో 222 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. నిన్న మహాబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో కాంగ్రెస్ తరుపున ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఖుష్బూ కేసీఆర్ కుటుంబంలోని నలుగురి కోసం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల్ని పీడిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ సెక్రటేరియట్కు వెళ్లకుండా ప్రజాధనంతో నిర్మించుకున్న ప్రగతిభవన్లో ఉంటూ ప్రజాసమస్యలు పట్టించుకోవట్లేదని అన్నారు.