శబరిమలలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చెన్నైకి చెందిన మనితి సంస్థ తరపున 50 మంది మహిళా బృందం ఒకటి. అయ్యప్పస్వామి దర్శనానికి ఇవాళ శబరిమలకు రానుంది. వీరంతా 50 యేళ్లలోపు మహిళలే కావడంతో కొట్టాయం విమానాశ్రయంలో ఈ బృందాన్ని అయ్యప్ప భక్తులు అడ్డుకున్నారు. నినాదాలు చేస్తూ వెనక్కి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ముందస్తు భద్రతను ఏర్పాటు చేశారు. తమిళనాడు, మధ్యప్రదేశ్, ఒడిసా, కర్ణాటక, కేరళకు చెందిన మహిళలతో శబరిమల సన్నిధానానికి చేరుకోనున్నట్లు మనితి సభ్యురాలు సెల్వీ ఇదివరకే తెలిపారు. కేపీ శశికళ నేతృత్వంలోని హిందూ ఐక్య వేదిక మాత్రం ‘మనితి’ బృందాన్ని ఎట్టిపరిస్థితుల్లో శబరిమల వెళ్లనివ్వబోమని స్పష్టం చేసింది. దీంతో ఇవాళ శబరి పరిసరాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు.