Amaravathi Farmers Movement: ఎల్లుండి తో 250వ రోజుకు అమరావతి రాజధాని రైతుల ఉద్యమం

అమరావతి: రాజధాని రైతుల ఉద్యమం ఆదివారం నాటికి 250 వ రోజుకి చేరుతుంది

- 250 వ రోజు కార్యక్రమానికి రాజధాని రణభేరి గా పేరు పెట్టిన జెఏసీ

- ఉదయం 10గంటలకు అన్ని దీక్షా శిబిరాలలో రణభేరి కార్యక్రమము

- రణభేరిలో డ్రమ్స్, పళ్ళెము, గరిట మోగించే కార్యక్రమం

- నాగలితో కూడిన జోడ్డేడ్లు, గేదలు, గొఱ్ఱెలు, మేకలతో ప్రత్యేక రూపకం " ఆలకించు ఆంధ్రుడా అమరావతి అన్నదాత ఆక్రందన"

- ప్రతి శిబిరంలో దళిత జె.ఏ.సి ఆధ్వర్యంలో " దగాపడ్డ దళిత బిడ్డ" ఆవేదన  

- ప్రతి శిబిరంలో ఆయా గ్రామాల బలహీన వర్గాల మనోవేదన తెలిపేలా

- " ఆలకించు ఆంధ్రుడా బజారున పడిన బడుగుజీవుల బ్రతుకులు" కార్యక్రమం

- 5 కోట్ల ఆంధ్రుల ఉద్యమ సహకారాన్ని ఆర్థిస్తూ కొంగు చాచి " భిక్షాటన " కార్యక్రమం

- నాటి ల్యాండ్ పూలింగ్ నుంచి నేటి వరకూ వివరిస్తూ " రాజధాని ప్రజల బ్రతుకు జట్కాబండి" రూపకం.

- అమరావతి ఉద్యమ గేయాలాపన మరియు నృత్యరూపకం

- సాయంత్రం 3 గంటలకు వెలగపూడిలో జె.ఏ. సి. నూతన ఆఫీస్ ప్రారంభోత్సవ కార్యక్రమం

- రాజధాని రణభేరికి మద్దతు ఇచ్చే రాజకీయ నాయకుల జూమ్ వెబినార్ లో రాజధాని మహిళలతో ముఖాముఖి

- సాయంత్రం 7 గంటలకు ప్రతి శిబిరం వద్ద కాగడాల ప్రదర్శన "అమరావతి వెలుగు - 5 కోట్ల ఆంధ్రుల వెలుగు " కార్యక్రమం

Update: 2020-08-21 16:48 GMT

Linked news