ఆప్కో మాజీ చైర్మన్ ఇంట్లో సీఐడీ దాడులు

ఆప్కో మాజీ చైర్మన్ గుజ్జల శ్రీనివాసులు ఇంట్లో, కార్యాలయాలపై సీఐడీ అధికారులు దాడులు చేశారు.

క‌డ‌ప జిల్లాలోని ఖాజీపేటలో గల ఆయన ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు.

గతంలో ఆప్కోలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఈ సోదాల్లో రూ.కోటి పైగా నగదు, 3 కిలోల బంగారం, 2 కిలోల వెండి, పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

గుజ్జల శ్రీనివాస్‌ ఆప్కో ఛైర్మన్‌గా ఉన్న సమయంలో భారీగా అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు అధికారుల దృష్టికి వెళ్లడంతో సోదాలు నిర్వహించారు.

ఈ నేపథ్యంలో సీఐడీ అధికారులు ఆయన ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారని సమాచారం. 

Update: 2020-08-21 16:20 GMT

Linked news