ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో సరికొత్త రికార్డు సృష్టించింది. డ్రోన్ల ద్వారా ఆహార పదార్థాలను డెలివరీ చేసే ప్రయోగాన్ని విజయవంతంగా పరీక్షించింది. కేవలం 10 నిమిషాల్లో 5 కిలోమీటర్లు ప్రయాణించగల హైబ్రిడ్ డ్రోన్ ద్వారా బుధవారం పరీక్ష నిర్వహించినట్లు జొమాటో తెలిపింది. ఇకపోతే జోమాటో గత ఏడాది డిసెంబరులో గుర్గావ్కు చెందిన స్టార్టప్ టెక్ఈగిల్ను కొనుగోలు చేసింది. డ్రోన్ల ద్వారా ఫుడ్ డెలివరీ లక్ష్యంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. డ్రోన్ విషయానికి వస్తే.. ఇది 10 నిమిషాల్లోనే 5 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. డ్రోన్ గంటకు గరిష్ఠంగా 80 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. 5 కిలోల బరువు కలిగిన ఆహారాన్ని మోసుకెళ్లగలదు. రోడ్డు మార్గం కన్నా ఆకాశ మార్గాన ఆహార పదార్థాలను మరింత వేగవంతంగా డెలివరీ చేయాలనే ఉద్దేశంతో ఈ నూతన సర్వీసులకు శ్రీకారం చుట్టినట్లు కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో దీపిందర్ గోయల్ తెలిపారు. దీనికి టెక్నాలజీ అంత సిద్ధంగా ఉన్నప్పటికీ నియంత్రణ మండళ్లు అనుమతించాల్సి ఉంటుందన్నారు.
We successfully tested a hybrid drone 🛩️ – fusion of rotary wing and fixed wings on a single drone; covered 5 kms in 10 mins with a peak speed of 80 kmph; with a payload of 5kgs.
— Deepinder Goyal (@deepigoyal) June 12, 2019
Exciting times ahead!
For more details – https://t.co/e9qgGQy9ex pic.twitter.com/DbrUCmK2AW