రైతుభరోసా పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్

Update: 2019-10-15 09:20 GMT

ఏపీ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతు భరోసా పథకాన్ని ముఖ్యమంత్రి జగన్‌ ప్రారంభించారు. నెల్లూరు విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. అన్నదాతల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడానికి ప్రభుత్వం తరపున ఏటా 13 వేల 500 ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్లు జగన్‌ ప్రకటించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా రైతులకు ఇచ్చిన మాట ప్రకారం వారికి భరోసా ఇస్తూ ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు జగన్‌ పేర్కొన్నారు.  

Tags:    

Similar News