శనివారం మూడు జిల్లాల్లో జగన్ ప్రచారం..

Update: 2019-03-22 15:59 GMT

ప్రచారానికి రెండురోజుల విరామం ఇచ్చిన జగన్ శనివారం నుంచి మళ్ళీ సుడిగాలి పర్యటనకు సిద్ధమయ్యారు. శనివారం మూడు జిల్లాల్లో ఆయన ఎన్నికల ప్రచారం చేస్తారని వైఎస్సార్‌ సీపీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ ప్రోగ్రాం కమిటీ కన్వీనర్ తలశిల రఘురామ్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. శనివారం శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో వైఎస్‌ జగన్‌ పర్యటించనున్నారని..

ఉదయం 9.30 గంటలకు పలాస(శ్రీకాకుళం)లో.. అనంతరం 11.30 గంటలకు పాడేరు(విశాఖపట్నం)లో.. మధ్యాహ్నం 2 గంటలకు పిఠాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని ఆయన తెలిపారు. ఇదిలావుంటే గురు, శుక్రవారం జగన్ ప్రచారానికి దూరంగా ఉన్నారు. మానిఫెస్టోకు తుదిమెరుగులు దిద్దుతున్న జగన్ అందుకోసం గురువారం విరామం తీసుకున్నారు. అలాగే శుక్రవారం పులివెందులలో నామినేషన్ సందర్బంగా జగన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే పులివెందులలో జరిగిన భారీ భహిరంగసభలో ఆయన ప్రసంగించారు. 

Similar News