కొన్ని హామీలు బాగానే ఉన్నాయి: మిథున్‌‌రెడ్డి

Update: 2019-07-05 11:50 GMT

కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరిగిందని వైసీపీ లోక్‌‌సభాపక్ష నేత మిథున్‌‌రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా గురించి కానీ, విభజన హామీల గురించి కానీ కనీస ప్రస్తావన లేదన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక నిధుల కేటాయింపుపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని మిథున్ అసంతృప్తి వ్యక్తంచేశారు. కేంద్రం ప్రకటించిన కొన్ని పథకాలు బాగానే ఉన్నాయని, కానీ అవన్నీ అమలైనప్పుడే ప్రభుత్వాన్ని అభినందించగలమని మిథున్‌‌రెడ్డి అన్నారు. గృహనిర్మాణం, సెల్ప్‌ హెల్ప్‌ గ్రూప్స్‌ కోసం ప్రకటించిన హామీలను త్వరగా అమలు చేయాలని కేంద్రాన్ని కోరారు మిథున్‌‌రెడ్డి. 

Tags:    

Similar News