చిత్తూరు జిల్లా కుప్పం టూర్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఉహించని ఘటన ఎదురైంది. ఆర్అండ్బి అతిధి గృహంలో ఉన్న చంద్రబాబును చూసేందుకు వచ్చిన మహిళలు కన్నీరు పెట్టుకున్నారు. ఓటమిని జీర్ణించుకోలేపోతున్నామని వాపోయిన మహిళలను ఓదార్చారు. గెలుపు, ఓటములు సహజమని మంచి రోజులు మళ్లీ వస్తాయని అధైర్యపడొద్దని వారికి భరోసా ఇచ్చారు. అనంతరం ప్రజల నుంచి వినతి ప్రతాలు స్వీకరించారు.