తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుల పేర్లు ఖరారయ్యాయి. మొత్తం 28మందికి టీటీడీ బోర్డులో చోటు దక్కింది. ఆంధ్రప్రదేశ్ నుంచి 8మంది తెలంగాణ నుంచి ఏడుగురు తమిళనాడు నుంచి నలుగురు కర్నాటక నుంచి ముగ్గురు మహారాష్ట్ర, ఢిల్లీ నుంచి ఒక్కొక్కరికి పాలక మండలిలో అవకాశం కల్పించారు.
టీటీడీ పాలక మండలిలో ఆంధ్రప్రదేశ్ నుంచి 8మందికి చోటు కల్పించగా, అందులో నలుగురు ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించారు. ఎమ్మెల్యేల్లో రమణమూర్తి, మల్లికార్జునరెడ్డి, గొల్ల బాబూరావు, కె.పార్ధసారధిలకు చోటు దక్కింది. ఇక తెలంగాణ నుంచి జూపల్లి రామేశ్వర్రావు, బి.పార్ధసారధిరెడ్డి. యు.వెంకటభాస్కరరావు, మూరంశెట్టి రాములు. డి.దామోదర్రావు. కె.శివకుమార్, పుత్తా ప్రతాప్రెడ్డికి అవకాశం దక్కింది. అలాగే ఎక్స్ అఫీషియో సభ్యులుగా తుడా ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి, స్పెషల్ సెక్రటరీ ఎండోమెంట్ కమిషనర్, టీటీడీ ఈవోలు కూడా పాలక మండలి సభ్యులుగా ఉండనున్నారు.
ఇక తమిళనాడు నుంచి కృష్ణమూర్తి వైద్యనాథన్, ఎస్.శ్రీనివాసన్, డాక్టర్ నిచితా ముత్తవరపు, ఎమ్మెల్యే కుమారగురులకు టీటీడీ పాలక మండలిలో స్థానం దక్కింది. అలాగే కర్నాటక నుంచి రమేష్శెట్టి, సంపత్ రవినారాయణ, సుధా నారాయణమూర్తిలకు అవకాశం కల్పించారు. ఇక ఢిల్లీ నుంచి ఎమ్మెస్ శివశంకరన్, మహారాష్ట్ర నుంచి రాజేష్ శర్మలు టీటీడీ పాలక మండలిలో చోటు దక్కించుకున్నవారిలో ఉన్నారు.