టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు బదిలీ

Update: 2019-07-01 10:48 GMT

టీటీడీ జేఈవో కేఎస్ శ్రీనివాసరాజును బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన్ను సాధారణ పరిపాలన శాఖకు బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీనివాసరాజు స్థానంలో బసంత్‌ కుమార్‌‌కు తిరుమల జేఈఓగా బాధ్యతలు అప్పగిస్తూ జీఓ జారీ చేసింది. కొత్త జేఈఓగా నియమితులైన బసంత్‌ కుమార్‌ 2007 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్‌ అధికారి. తక్షణమే బాధ్యతలు చేపట్టాలని ఆయన్ను ప్రభుత్వం ఆదేశించింది. శ్రీనివాసరావు తిరుమల జేఈఓగా 8సంవత్సరాల 2 నెలల కాలం పాటు విధులు నిర్వర్తించారు.  

Tags:    

Similar News