ఆంధ్రప్రదేశ్ : ఆంధ్రప్రదేశ్ లో మొదటిసారి అధికారంలోకి వచ్చినా వైసీపీ అసెంబ్లీలో వార్షిక సంవత్సరానికి గాను బడ్జెట్ ని ప్రవేశ పెట్టింది . అయితే దీనిపై టిడిపి శాసనసభాపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు విమర్శలు చేశారు. కవర్ పేజీ చూస్తే ఇది ప్రభుత్వ బడ్జెట్టా.. పార్టీ బడ్జెట్టా? అనే అనుమానం వచ్చిందన్నారు. జగన్ ప్రభుత్వం బడ్జెట్లో బీసీలకు అన్యాయం చేసిందని ఆరోపించారు. ఇక మాజీ ఆర్ధిక శాఖా మంత్రి యనమల కూడా విమర్శలు చేసారు . బడ్జెట్ ప్రచారం ఎక్కువ , పస తక్కువ అని ఎద్దావా చేసారు . అన్ని పథకాలకు జగన్, వైఎస్ఆర్ పేర్లే పెడుతున్నారని పేర్లు పెట్టేందుకు రాష్ట్రంలో ఇంకెవరూ నాయకులు లేరా? అని అయన ప్రశ్నించారు.