బొత్స ఆరోపణల్ని ఖండించిన బాలకృష్ణ అల్లుడు

Update: 2019-08-28 12:02 GMT

చంద్రబాబు వియ్యంకుడికి అమరావతిలో చౌకగా భూములు కట్టబెట్టారంటూ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన ఆరోపణల్ని టీడీపీ నేత, బాలకృష్ణ చిన్న అల్లుడు ఎ.భరత్‌ ఖండించారు. తమ సంస్థకు కిరణ్‌కుమార్‌ రెడ్డి మంత్రివర్గంలో బొత్స మంత్రిగా ఉండగానే భూములు కేటాయించారని స్పష్టంచేశారు. న్యాయపరమైన వివాదం నేపథ్యంలో ఆ భూముల్ని ఇంతవరకు తమకివ్వలేదని వెల్లడించారు. అప్పట్లో ప్రభుత్వం తమకు కేటాయించిన భూములు అమరావతి, విజయవాడ నుంచి సుమారు 100కిలో మీటర్ల దూరంలో ఉన్నాయన్నారు.


Tags:    

Similar News