చెన్నైకి తాగునీటి విడుదలకు ఏపీ సీఎం జగన్ ఆదేశం
తమిళనాడుకు చెందిన మంత్రుల బృందం ఇవాళ ఏపీ సీఎం జగన్ను కలిసింది. తాగునీటి కోసం చెన్నై ప్రజలు పడుతున్న కష్టాలను జగన్కు మంత్రులు వివరించారు.
తమిళనాడుకు చెందిన మంత్రుల బృందం ఇవాళ ఏపీ సీఎం జగన్ను కలిసింది. తాగునీటి కోసం చెన్నై ప్రజలు పడుతున్న కష్టాలను జగన్కు మంత్రులు వివరించారు. తాగునీరు లేక అల్లాడిపోతున్న 90 లక్షల ప్రజలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమిళ మంత్రుల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన జగన్ వెంటనే చెన్నైకి తాగునీటి జలాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పక్క రాష్ట్రాలతో సోదరబావంతో మెలగాలని లక్షలాదిగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు ఆదుకుంటామని జగన్ వారికి భరోసా ఇచ్చారు.