అనంతపురం జిల్లా గుత్తి మండలంలో బ్రాహ్మణపల్లిలో దళితులకు ఘోర అవమానం జరిగింది. ఆలయంలో దళితులు ప్రవేశించారని గ్రామపెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిమానా విధించారు. మరోసారి ఆలయంలోకి ప్రవేశిస్తే చంపుతామని బెదిరించారు. బ్రాహ్మణపల్లిలో పెద్దన్న అనే వ్యక్తి తన కోడలితో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలోకి ప్రవేశించి పూజలు ముగించుకుని బయటకు వచ్చాడు. అదే సమయంలో అగ్రకులానికి చెందిన కొందరు వ్యక్తులు వారితో దురుసుగా ప్రవర్తించారు. కులం పేరుతో దూషించారు. గ్రామపెద్దల సమక్షంలోకి తీసుకువెళ్లారు. గ్రామపెద్దలు దళితులకు 5 వేల రూపాయల జరిమానా విధించారు. విధిలేని పరిస్థితుల్లో జరిమానా కట్టి అక్కడ నుంచి బయటపడ్డాడు.