ఏపీ దేవాదాయ పాలకమండళ్లు, ట్రస్ట్ బోర్డులలో కూడా రిజర్వేషన్లను కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీచేసింది. పాలకమండళ్లలో రిజర్వేషన్ పై గత అసెంబ్లీ సమావేశాలలో సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. దీంతో ఇకపై అన్ని ట్రస్ట్ బోర్డులు, పాలక మండళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు యాభై శాతం పదవులు దక్కనున్నాయి. మహిళలకు యాభై శాతం పదవులు కేటాయించేలా ఉత్తర్వులు జారీచేసింది.