రాజధాని గ్రామాల్లో పాదయాత్రకి అనుమతి లేదు: అడిషనల్‌ ఎస్పీ

Update: 2020-01-06 06:15 GMT

రాజధాని గ్రామాల్లో పాదయాత్రకి అనుమతి లేదని పోలీసులు రైతులకు తేల్చి చెప్పారు. అనుమతి లేకపోయినా రోడ్డుపై నిరసనలు ఆందోళనలు చేస్తున్నారని అడిషనల్‌ ఎస్పీ చక్రవర్తి తెలిపారు. పోలీసులు ఉన్నది ప్రజల రక్షణ కోసమేనని... నిరసనలు తెలిపే హక్కు ఉంటుందని.... కానీ అది ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదన్నారు.

మందడం మహిళలు పోలీసులకు ఎదురు తిరిగారని..., మహిళా రైతులు మహిళా కానిస్టేబుల్స్ పై దాడి చేయడంతో గాయాలయ్యాయన్నారు. పోలీసులు ఎవరిపై ఆధారపడి పనిచేయడం లేదని... వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు డిపార్ట్‌మెంటే ఏర్పాటు చేస్తుందన్నారు. రైతులు శాంతయుతంగా ఉన్నంత వరకు ఎలాంటి ఆటంకం కలగందన్న ఆయన... చట్టాన్ని ఉల్లంగిస్తే చర్యలు తప్పని హెచ్చరించారు.

Tags:    

Similar News