జనసేనాని పవన్ కళ్యాణ్ గురువారం విజయవాడ వచ్చారు. పార్టీ నేతలతో మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. తన సోదరుడు నాగబాబు తో కల్సి ఇటీవలి ఎన్నికల్లో పార్టీ పరిస్థితిపై నేతలతో చర్చించారు. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ఓటమి సహా, పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. అంతేకాకుండా పార్టీ భవిష్యత్ కార్యాచరణ.. ఎలాంటి మార్గాన్ని అనుసరించాలి? పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలు, స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలతో పవన్ మాట్లాడినట్లు తెలుస్తోంది.