ప్రజావేదిక కూల్చివేత ప్రక్రియ ప్రారంభమైంది. ప్రజావేదిక వద్దకు జేసీబీలు, సుత్తెలు, పలుగు, పారలతో కూలీలు చేరుకున్నారు. రాత్రికి ప్రజావేదికను కూల్చివేత పనిని పూర్తి చేయనున్నారు. ప్రజావేదిక ఫర్నిచర్, ఎలక్ట్రికల్ సామాగ్రిని అధికారులు తరలించారు. హైకోర్టు సమీపంలోని నర్సరీకి పూల కుండీలను తీసుకెళ్లారు.