ఏటీఎం చోరీకి విఫలయత్నం..మంటలు చెలరేగడంతో దొంగలు పరారీ...

Update: 2020-01-16 07:53 GMT
ఏటీఎం చోరీకి విఫలయత్నం..మంటలు చెలరేగడంతో దొంగలు పరారీ...

అనంతపురం జిల్లా పెనుకొండలో దుండగులు ఏటీఎం చోరీకి ప్రయత్నించారు. వజ్రాలపేటలో ఉన్న యాక్సిస్‌ ఏటీఎంలో చోరీ చేయడానికి వచ్చిన ఇద్దరు దుండగులు మొదట సీసీ కెమెరా వైర్లను కట్‌ చేశారు. అనంతరం ఏటీఎంను పగలగొట్టే ప్రయత్నం చేశారు.

గ్యాస్‌ కట్టర్‌తో వైర్లను కట్ చేయడానికి ప్రయత్నించడంతో అయితే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో సైరన్‌ మోగడంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ఘటనను సీసీ కెమెరాలో గమనించిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి ఫిర్యాదు చేయగా, తక్షణమే స్పందించిన సిబ్బంది మంటలకు అదుపులోకి తెచ్చారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

Tags:    

Similar News