మహిళా శిశుసంక్షేమశాఖపై సీఎం జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమావేశమైన జగన్ సంక్షేమ పథకాల అమలపై మార్గనిర్దేశం చేశారు. బయోమెట్రిక్, ఐరిస్, వీడియో స్క్రీనింగ్ ఇవన్నీ లబ్దిదారుడికి పథకాలు అందజేయడానికే కానీ ప్రజలు ఇబ్బంది కలిగించేలా ఉండకూడదని సూచించారు. ఏమైనా ఇబ్బందులుంటే గ్రామ సచివాలయాల్లో హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని దిశానిర్దేశం చేశారు.