జనసేనలో ఎంపీ టిక్కెట్ ఇచ్చినా.. వైసీపీలో చేరిక..

Update: 2019-03-16 16:25 GMT

జనసేన పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల పవన్‌ కల్యాణ్‌.. విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించిన గేదెల శ్రీనివాస్ అలియాస్‌ శ్రీనుబాబు శనివారం వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఈనెల 14న జనసేన లోక్‌సభ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు పవన్. ఈ జాబితాలో గేదెల శ్రీనివాస్‌ పేరును ప్రకటించారు. అయితే విచిత్రంగా ఆయన వైఎస్సార్‌ సీపీలో చేరడం జనసేన నేతలను విస్మయానికి గురిచేసింది. 

Similar News