కాసేపట్లో ఏపీ కేబినెట్‌ భేటీ.. మంత్రివర్గం ముందు అనేక కీలక ప్రతిపాదనలు !

Update: 2020-02-12 04:46 GMT

సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఏపీ కేబినెట్‌ భేటీ సమయంలో మార్పు చోటు చేసుకుంది. సీఎం జగన్‌ అధ్యక్షతన సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో కాసేపట్లో భేటీ జరగనుంది. మంత్రివర్గం ముందు అనేక కీలక ప్రతిపాదనలు రానున్నట్లు తెలుస్తోంది.

విద్యార్థులకు జగనన్న విద్యా కానుక ప్రతిపాదన, విద్యా కానుకలో 3 జతల యూనిఫాం, 2 జతల షూ, నోట్‌ బుక్స్‌, సీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ చేసిన ర్యాలీపై నమోదైన కేసులను రద్దు చేయాలనే ప్రతిపాదన మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియను 27 రోజుల నుంచి 20 రోజులకు కుదించే ప్రతిపాదనపై మంత్రివర్గంలో చర్చించనున్నారు. కేబినెట్ భేటీ అనంతరం సీఎం జగన్‌ ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని మోడీ, పలువురు కేంద్రమంత్రులతో సమావేశంకానున్నారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. 

Tags:    

Similar News