నేటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు... రేపు సభలో బడ్జెట్

Update: 2019-07-11 01:35 GMT

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి రేపు సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. మరోవైపు వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు కూడా వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెడతారు. శని, ఆదివారాలు మినహా 14 రోజులపాటు ఈ సమావేశాలు జరుగుతాయి. సభ్యులు కోరితే ఈ సమావేశాలు మరిన్ని రోజులు పెంచే అవకాశం ఉంది. అయితే, కరువు, విత్తనాలు, టీడీపీ నేతలపై దాడులకు సంబంధించి చర్చ జరపాలని టీడీపీ కోరింది. అయితే, ఈ అసెంబ్లీ సమావేశాలు హాట్‌ హాట్‌గా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. అధికార, ప్రతిపక్ష సభ్యులు వాగ్వాదం, మాటల యుద్ధం తొలిరోజు నుంచి మొదలయ్యే పరిస్థితి నెలకొంది. ఓ వైపు ప్రజావేదిక కూల్చేయడం, మరోవైపు టీడీపీ కార్యకర్తలు, నేతలపై దాడులపై జరుగుతున్న దాడులపై టీడీపీ సభ్యులు చర్చకు పట్టుపట్టనున్నారు.  

Tags:    

Similar News