అనంతపురం జిల్లా హిందూపురంలో శుక్రవారం సినీనటుడు బాలకృష్ణ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని ఉన్నతస్థాయికి తెచ్చిన చంద్రబాబుకే మళ్ళీ ఏపీ ప్రజలు పట్టం కడతారని.. టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, అత్యధిక స్థానాలు గెలుస్తామని బాలకృష్ణ జోస్యం చెప్పారు.
రైతు రుణమాఫీ, పింఛన్ల పెంపు, పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవతో పాటు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజల్లో బాగా నాటుకుపోయాయని ఆయన అన్నారు. వైసీపీకి శవ రాజకీయాలు చేయడం పరిపాటిగా మారిందని బాలకృష్ణ అన్నారు.