కడపలో కరోనా కలకలం.. గల్ఫ్ నుంచి వచ్చిన మహిళకు కరోనా అనుమానం

Update: 2020-03-13 12:03 GMT

కడపలో మహిళకు కరోనా కలకలం మొదలయ్యింది. గల్ఫ్ నుంచి వచ్చిన మహిళకు కరోనా లక్షణాలు అనుమానంతో కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వ్యాధి నిర్ధారణ కోసం మహిళ నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించి ఢిల్లీకి పంపించారు రిమ్స్ వైద్యులు. కడప నగరం బెల్లంమండి వీధికి చెందిన మహిళ ఖైరూన్‌గా గుర్తించారు. రిమ్స్‌లో ప్రత్యేక విభాగంలో ఆమెకు వైద్యం అందిస్తున్నారు. కాగా.. ఖైరూన్‌ ఇటీవలే మక్కా వెళ్లి వచ్చినట్లు తెలిసింది. కాగా ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

Tags:    

Similar News