మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమారుడు కోడెల శివరాం పై మరో ఫిర్యాదు అందింది. క్యాటరింగ్ కు సంబంధించి 25 లక్షల రూపాయలు ఇవ్వకుండా, తనను అనుచరులతో కొట్టించారంటూ, ఎలినీది శ్రీనివాస్ అనే వ్యక్తి గ్రీవిన్స్ లో ఫిర్యాదు చేశారు. శ్రీనివాస్ కంప్లైంట్ను స్వీకరించిన రూరల్ ఎస్పీ జయలక్ష్మీ, విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. గత రెండు రోజుల్లోనే కోడెల కుటుంబంపై రెండో కేసు నమోదైంది. తొలి కేసు కోడెల కూతురుపై నరసరావుపేట డీఎస్పీ కేసు నమోదు చేశారు.