వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక మలుపు తిరిగింది. దీన్ని సుపారీ హత్యగా పోలీసులు తేల్చారు. కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన సునీల్ గ్యాంగ్ ఈ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ కేసుపై దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన సిట్ అధికారులు.. ఇప్పటివరకు 800 మంది సాక్షులను విచారించి.. ఈ నిర్ణారణకు వచ్చారు. ఇటీవల ఈ కేసులో కీలక సాక్షిగా ఉన్న శ్రీనివాస్రెడ్డి మరణంతో.. అనుమానాలు బలపడ్డాయి. ఆ కోణంలో దర్యాప్తు చేసిన అధికారులకు.. సునీల్ గ్యాంగ్ విషయం తెలిసింది.