ఉపాధ్యాయ నియామకాల్లో జాప్యాన్ని నిరసిస్తూ టీఆర్టీ అభ్యర్థులు ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ప్రగతి భవన్ వద్ద టీఆర్టీ సభ్యులు ఆందోళన చేపట్టారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ప్రభుత్వం పోస్టింగ్లు ఇవ్వడంలో ఆలస్యం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రికి రాత్రే విద్యా వాలంటీర్ పోస్టులు భర్తీ చేయడం దేనికి సంకేతమని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ముట్టడికి యత్నించిన టీఆర్టీ అభ్యర్థులను పోలీసులు అరెస్టు చేయడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది.