జీహెచ్ఎంసీ పరిధిలో పది పరీక్షలు వాయిదా..
తెలంగాణలో పదో తరగతి పరీక్షలకు హైకోర్టు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
తెలంగాణలో పదో తరగతి పరీక్షలకు హైకోర్టు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ మినహా రాష్ట్ర వ్యాప్తంగా టెన్త్ పరీక్షలు నిర్వహిణకు అనుమతినిచ్చింది. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతున్నందున పరీక్షలను వాయిదా వేసింది.
సప్లమెంటరీ పరీక్షలకు జీహెచ్ఎంజీ పరిధిలోని విద్యార్థులకు అనుమతించాలని హైకోర్టు ఆదేశించింది. అన్ని పరీక్షా కేంద్రాల్లో వైరస్ వ్యాప్తి కాకుండా ఉండేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖను న్యాయస్థానం ఆదేశించింది. విద్యార్థులకు వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది.