మంత్రి కేటీఆర్‌తో సౌదీ అరేబియా రాయబారి భేటీ

-తెలంగాణ, సౌదీ అరేబియా మధ్య సంబంధాల బలోపేతంపై చర్చ -పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకొస్తున్నాయన్నకేటీఆర్‌

Update: 2019-12-09 15:54 GMT
Saudi Arabia Ambassador H.E. Dr. Saud bin Mohammed Al

ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో సౌదీ అరేబియా రాయబారి సౌద్ బిన్ మహ్మద్ అల్ సతీ భేటీఅయ్యారు. తెలంగాణ, సౌదీ అరేబియా మధ్య సంబంధాల బలోపేతం, రాష్ట్రంలో ఐటీ రంగంలో పెట్టుబడుల విషయంపై ప్రగతిభవన్‌లో చర్చించారు. తెలంగాణలో అద్భుతమైన ప్రగతి సాధించిందన్న కేటీఆర్‌, అనేక రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పూర్తి సహకారం అందిస్తామన్నారు. ఇప్పటికే తెలంగాణలో అనేక కంపెనీలు, సంస్థలు కార్యకలాపాలను విజయవంతంగా కొనసాగిస్తున్నాయని గుర్తు చేశారు.  




Tags:    

Similar News