ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా లేబర్ ఆఫీస్లకు చేరుకుని అధికారులకు వినతిపత్రాలు ఇవ్వాలని ఆర్టీసీ జేఏసీ నేతలు నిర్ణయించారు. విధుల్లోకి చేరేందుకు డిపోల వద్దకు వచ్చిన కార్మికులను అరెస్ట్ చేసి, తమ హక్కులకు భంగం కలిగిస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు.
విధులకు హాజరవుతామన్న ప్రభుత్వం నుండి స్పందన లేకపోవడంతో ఆర్టీసీ కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఇవాళ జరిగే కేబినెట్లో తమకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయం కోసం ఆర్టీసీ కార్మికులు ఎదురు చూస్తున్నారు.