పోలీస్‌పై దాడి చేసి తుపాకీతో ఖైదీ పరార్..

జైలులో ఉన్న ఖైదీని బయటికి తీసుకుని వెల్లినపుడు అతను పోలీసులపై దాడి చేసి పారిపోవడం లాంటి సీన్ సినిమాల్లో చాలానే చూసి ఉంటాం.

Update: 2020-04-05 06:50 GMT
Nizamabad Prisoner (File Photo)

జైలులో ఉన్న ఖైదీని బయటికి తీసుకుని వెల్లినపుడు అతను పోలీసులపై దాడి చేసి పారిపోవడం లాంటి సీన్ సినిమాల్లో చాలానే చూసి ఉంటాం. బహుశా ఈ ఖైదీ కూడా అలాంటి సినిమాలని ఎక్కువగా చూసి ఉంటాడు. అందుకే అచ్చం సినిమాల్లో హీరోనో, విలనో పోలీసులపై దాడి చేసిపారిపోయినట్టు అతను కూడా శనివారం రాత్రి పారిపోయాడు. ఈ సంఘటన నిజమాబాద్ లో చోటు చేసుకుంది. పూర్తివివరాల్లోకెళితే నిజామాబాద్‌ గౌతంనగర్‌కు చెందిన ప్రసాద్‌ అనే వ్యక్తిని దొంగతనం కేసులో పోలీసులకు చిక్కాడు.

ఇతన్ని అదపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని జిల్లా కోర్టులో హాజరు పరిచారు. కాగా కోర్టు ఇతనికి జ్యుడీషియల్ రిమాండ్‌ విధించడంతో అతన్ని పోలీసులు సారంగపూర్ జైలుకు తరలించారు. జైలులో ఉన్న అను తనకు అనారోగ్యంగా ఉందని చెప్పడంతో నిజామాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ కు పోలీసులు తీసుకుని వెల్లారు. అక్కడ వైద్యం చేయించి తిరిగొస్తున్న క్రమంలో నిందితుడు ఎస్కార్ట్ పోలీసులపై దాడి చేసాడని తెలిపారు. కానిస్టేబుల్ దగ్గరున్న తుపాకీని తీసుకుని రిమాండ్ ఖైదీ పరారయ్యాడు. రిమాండ్ ఖైదీ తుపాకీతో పారిపోవడంతో సీపీ కార్తికేయ జిల్లా పోలీసులను అప్రమత్తం చేసారు. అతని కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.


Tags:    

Similar News