ముగిసిన మొదటి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం

Update: 2019-01-19 14:52 GMT

తెలంగాణలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ నెల 21న ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి ఓట్ల లెక్కింపు ఉంటుంది. తరువాత ఫలితాలు వెల్లడిస్తారు. మొదటి విడతలో 4,479 గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్‌ విడుదల చేయగా.. అందులో 788 సర్పంచ్‌లు ఏకగ్రీవం అయ్యాయి. పలు కారణాలతో 5 పంచాయతీలకు నామినేషన్లు దాఖలు కాలేదు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కౌటింగ్‌ రోజు వరకు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి.  

Similar News