శ్రీనగర్ నిట్ తెలుగు విద్యార్థులకు కేటీఆర్ భరోసా ఇచ్చారు. జమ్ముకశ్మీర్ కర్ఫ్యూ పై శ్రీనగర్ నిట్ క్యాంపస్లో చదువుతున్న తెలుగు విద్యార్థులు కేటీఆర్ సహాయం కోరారు. తమని రక్షించాలంటూ శ్రీనగర్ నిట్ క్యాంపస్ నుంచి మెసేజ్ చేశారు. ఈ విషయంపై వెంటనే స్పందించిన కేటీఆర్.. ఢిల్లీ రెసిడెంట్ కమీషనర్తో తెలుగు విద్యార్థులు రక్షణ గురించి మాట్లాడారు. విద్యార్థులు రాష్ట్రానికి సురక్షితంగా రావడానికి ఏర్పాట్లు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని కేటీఆర్ భరోసా ఇచ్చారు. మరోవైపు ఢిల్లీ రెసిడెంట్ కమీషనర్.. తెలుగు విద్యార్థులతో నేరుగా టచ్లో ఉన్నారు.