కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. పీవీ ఘాట్ పక్కన ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరిగాయి. జైపాల్ రెడ్డికి నేతలు, అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. ఆయన పార్థివ దేహం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళి ఘటించారు. పార్టీలకు అతీతంగా నేతలు అంత్యక్రియలు హాజరయ్యారు. విలువల నేతగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న జైపాల్ రెడ్డి పార్థివ దేహానికి ఆయన పెద్ద కుమారుడు అరవింద్ రెడ్డి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. జైపాల్ను కడసారి చూసేందుకు పలువురు ప్రముఖులు తరలిరావడంతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కర్ణాటక సీఎల్పీ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కర్ణాటక మాజీ స్పీకర్ రమేశ్కుమార్ జైపాల్ రెడ్డి పాడె మోశారు.