నిజామాబాద్ జిల్లాలో అక్రమ ఇసుక రవాణా కొనసాగిస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బోధన్ మండలం హున్సా మందర్నా ఖాజూపూర్ గ్రామస్థులు ఆందోళన బాట పట్టారు. నకిలీ వేబిల్లులతో 24 గంటలపాటు ఇసుక తరలిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. నిబంధనలకు విరుద్దంగా కొనసాగుతున్న ఇసుక క్వారీ రద్దు చేయాలంటూ గ్రామస్థులు బైఠాయించారు.