పాకిస్తాన్లో హైదరాబాద్కు చెందిన ప్రశాంత్ అనే వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. పాస్పోర్ట్, వీసా లేకుండా పాకిస్తాన్లోని కొలిస్తాన్ ఎడారిలో ప్రవేశించేందుకు ప్రయత్నించిన ప్రశాంత్ను, ఆయనతో పాటు వచ్చిన మధ్యప్రదేశ్ కు చెందిన వారిలాల్ ను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. బహావల్ పూర్ దగ్గర అరెస్ట్ చేసిన పోలీసులు అక్కడి కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే తాను బాగానే ఉన్నానని త్వరలోనే విడుదల అవుతానని ప్రశాంత్ చెబుతున్నాడు.