మానవత్వం చాటుకున్న మంత్రి మల్లారెడ్డి

Update: 2019-06-03 12:32 GMT

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి. 

హైదరాబాద్‌లోని బాలానగర్ చౌరస్తాలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కొందరు గాయాలతో బాధపడుతున్నారు. ఈ లోపు అటు నుంచి వెళ్తున్న మంత్రి మల్లారెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డవారిని చూశారు. వెంటనే తన కాన్వాయ్ ను ఆపి సహాయక చర్యలు చేపట్టారు. సెక్యూరిటీ సిబ్బంది సాయంతో గాయపడ్డవారిని తన కాన్వాయ్‌లో ఆసుపత్రికి తరలించారు. మల్లారెడ్డి చూపిన చొరవ పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 


Tags:    

Similar News